యాప్నగరం

ఏపీ ప్రజలకు మరోసారి హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి

ఏపీలో ఎండలు, వడగాల్పులతో ఇబ్బంది పడుతున్న జనాలు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. శనివారం ఈ జిల్లాల్లో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచన. పెద్ద వయసు ఉన్నవారు, పిల్లలు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇవే పరిస్థితులు మరికొద్ది రోజులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Apr 2022, 6:48 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో కొద్దిరోజులుగా తీవ్ర వడగాల్పులు
  • శనివారం ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తం
  • తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీకి అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. శనివారం కూడా కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 100 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 571 మండలాల్లో ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుందని సూచించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్‌ విజయవాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటోంది.
శుక్రవారం వాతావరణ పరిస్థితులు చూస్తే.. అనకాపల్లి జిల్లాలోని ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అలాగే మిగిలిన జిల్లాల్లోని 40 మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 42.4, అనంతపురం 41.7, కడప, తిరుపతిల్లో 41.4, జంగమహేశ్వరపురం 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే 574 మండలాల్లో ఉక్కపోత పరిస్థితులు ఎక్కుగా ఉంది. జనాలు బయటకు అడుగేయాలంటేనే భయపడుతున్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణశాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. జనాలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిదని.. ముందు జాగ్రత్తగా డీహైడ్రేట్‌ కాకుండా ఓఆర్‌ఎస్‌, నిమ్మకాయ నీరు,కొబ్బరినీరు,లస్సీ, మజ్జిగ వంటివి తాగితే మంచిదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనాసరే అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.