యాప్నగరం

ఏపీలో ఇప్పటి వరకు కూల్ సమ్మర్‌ను ఎంజాయ్ చేశారుగా.. బీ రెడీ, ఇక అసలు సినిమా!

Ap Weather Update ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలో ప్రజల్ని అప్రమత్తం చేసింది. మోచా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదని.. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే బుధవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. ప్రజలు అందుకు తగిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు చల్లని వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసిన జనాలకు.. ఇక మళ్లీ భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 May 2023, 1:33 pm

ప్రధానాంశాలు:

  • ఏపీకి ప్రజలకు ముఖ్యమైన అలర్ట్
  • మళ్లీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
  • అప్రమత్తంగా ఉండాలని సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AP High Temperatures
Ap Weather Today: ఏపీలో నిన్నటి వరకు కూల్ సమ్మర్‌ను జనాలు ఎంజాయ్ చేశారు. ఎండల నుంచి రిలీఫ్ ఇస్తూ 10 రోజులకుపైగా వర్షాలు కురిశాయి. మోచా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందనే టెన్షన్ వెంటాడింది. కానీ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదని.. రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. మత్స్యకారులు నేటి నుంచి మే 16 వరకు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
తుఫాన్ సంగతి అలా ఉంటే.. ఏపీలో బుధవారం నుంచి భానుడి భగభగలు మొదలవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 'బుధవారం 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి' అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

మంగళవారం కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు బుధవారం నుంచి మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయి అంటున్నారు.
Ap Mocha Cyclone Rains: మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా బలపడింది. నేడు (బుధవారం) అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారుతుంది అంటున్నారు. ఈ తుఫాన్ 11 వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాల వైపు పయనిస్తుంది అంటున్నారు. ఈ నెల 14న తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వాయుగుండం ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఈసారి వేసవికాలంలో వాతావరణం కాస్త వెరైటీగా అనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వర్షాలు కురిశాయి. మార్చి నెల చివరి వారం, ఏప్రిల్ మొదటి వారం ఎండలు మండిపోగా.. ఆ వెంటనే మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వానలు కురిశాయి.. అక్కడక్కడా వడగళ్ల వర్షాలు కూడా పడ్డాయి. ఈ అకాల వర్షాలతో ముఖ్యంగా రైతులు బాగా నష్టపోయారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.