యాప్నగరం

ఈనెల 29 నుంచి 1,081 ప్రత్యేక బస్సులు.. వివరాలివే!

ఈనెల 29వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అయితే, ఛార్జీల విషయంలో మాత్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 19 Sep 2022, 8:33 pm
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.
Samayam Telugu ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


ఈ మేరకు విజయవాడ నుంచి రాష్ట్రం నలుమూలలకు 1,081 అదనపు బస్సులు నడుస్తాయని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, రాయలసీమ జిల్లాలకు, అమలాపురం, భద్రాచలానికి, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించింది.

అలాగే, ప్రయాణికులకు ఊరట కలిగించే విషయం చెప్పింది. సాధారణంగా ప్రత్యేక బస్సుల్లో అధనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ, ఈసారి ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉంటుందని వివరించింది. ఏపీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక బస్సుల వివరాలను పొందుపరిచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.