యాప్నగరం

ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త: దసరాకు స్పెషల్ బస్సులు.. పూర్తి వివరాలివే..!

APSRTC Dussehra Buses: ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.

Samayam Telugu 13 Oct 2020, 12:16 am
దసరా రాబోతున్న నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నడిచినట్లే దూర ప్రాంతాలకు 2,028 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించారు.
Samayam Telugu ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు


డిమాండ్‌ మేరకు రిజర్వేషన్‌ చేసుకునే బస్సుల సంఖ్య కూడా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు రీజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులపై చర్చలు ఇంకా పూర్తిగా సఫలం కాకపోవడంతో తెలంగాణకు బస్సులు నడపడం లేదు. ఇరు రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాకే తెలంగాణకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది.

అయితే దసరా లోపు దీనిపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కరోనా లాక్‌డౌన్ తర్వాత అతి పెద్ద ఫెస్టివల్ సీజన్ దసరా కావడంతో ఎలాగైనా పండుగను క్యాష్ చేసుకోవాలని ఆర్టీసీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే భారీగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో దసరా సీజన్ నష్టాల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.