యాప్నగరం

ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపరాఫర్.. మరోసారి ఛాన్స్, 15 రోజులు మాత్రమే

లాక్ డౌన్ సమయంలో రిజర్వేషన్ చేయించుకున్న టిక్కెట్లు రద్దు చేయించుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి చెల్లిస్తారు. బస్టాండ్ లేదా ఏ. టీ. బీ కౌంటర్లలో తమ టిక్కెట్లను చూపించి, రద్దు చేసుకుని డబ్బు పొందే అవకాశాన్ని ఇప్పటికే ప్రయాణికులకు కల్పించారు.

Samayam Telugu 1 Sep 2020, 8:41 am
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్-19 సమయంలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు టిక్కెట్లు రద్దు చేసుకుని నగదు తిరిగి పొందే అవకాశాన్ని మరోసారి పొడిగించింది. లాక్ డౌన్ సమయంలో రిజర్వేషన్ చేయించుకున్న టిక్కెట్లు రద్దు చేయించుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి చెల్లిస్తారు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ ద్వారా టిక్కెట్టు రిజర్వేషన్ చేయించుకున్న కొంతమంది ప్రయాణికుల బ్యాంకు అకౌంట్లకు నగదు జమ చేశారు.
Samayam Telugu ఏపీఎస్ ఆర్టీసీ


Read Also:
విజయవాడ: రోడ్డుపై చెప్పులు అమ్మిన లెక్కల మాష్టారికి ఊరట.. రెండు ఆప్షన్‌లు

జులై 15 నుంచి 29 వరకు బస్టాండ్ లేదా ఏ. టీ. బీ కౌంటర్లలో తమ టిక్కెట్లను చూపించి, రద్దు చేసుకుని డబ్బు పొందే అవకాశాన్ని ఇప్పటికే ప్రయాణికులకు కల్పించారు. కానీ కొన్ని కారణాలతో కొంతమంది ప్రయాణికులు రద్దు చేసుకోలేకపోయారు.. అందుకే మరోసారి వారికి అవకాశం కల్పించారు. మరో 15 రోజులపాటు అంటే 31-08-2020 నుంచి 14-09-2020 వరకు రద్దు చేసుకుని డబ్బును తిరిగి పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓ) శ్రీ కె. ఎస్. బ్రహ్మానంద రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Also Read: నెల్లూరు వచ్చిన హీరోలు రాంచరణ్, శర్వానంద్.. ఆప్తుడు చనిపోవడంతో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.