టీడీపీలో వైఎస్సార్సీపీ నేతలు చేరడం ఏంటని షాకవుతున్నారా మీరు వింటున్నది నిజమే. అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు కొందరు ప్రతిపక్ష టీడీపీలో చేరారు. బుధవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సమక్షంలో విశాఖ జిల్లా అరకు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత దొన్ను దొర తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దొన్ను దొర సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. Read Also: YS Jagan కోసం తిరుమలకు వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్ర
వంద రోజుల్లోనే వైఎస్సార్సీపీ పాలన ఎంత దారుణంగా ఉందో బయటపడిందన్నారు చంద్రబాబు. కొంతమంది కార్యకర్తలు తమ పనుల కోసం పార్టీలు మారుతున్నారని.. ఇటు పార్టీలో ఉన్నవారిని అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. అరకుతో పాటూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల అభివృద్ధికి కృషిచేసిన ఘనత టీడీపీదేనని చెప్పుకొచ్చారు.
మూడు నెలలకే సీన్ రివర్స్!.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
Chandrababu Naidu| చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న అరకు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ కీలక నేత, కార్యకర్తలు. పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు.
Samayam Telugu 4 Sep 2019, 9:34 pm
ప్రధానాంశాలు:
- గత ఎన్నికల్లో అరకు నుంచి వైఎస్సార్సీపీ రెబల్గా పోటీచేసిన దొర
- వంద రోజుల్లో వైఎస్ జగన్ పాలన ఏంటో బయటపడిపోయింది
- సొంత పనుల కోసమే కొందరు కార్యకర్తలు పార్టీలు మారుతున్నారు