యాప్నగరం

YS Jagan కు ధన్యవాదాలు చెప్పిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

CM Jagan: తమ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధన్యవాదాలు చెబుతున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ట్వీట్ చేశారు.

Samayam Telugu 27 Mar 2020, 8:41 pm
తమ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పెమా ఖండు ట్విటర్‌ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రవాసులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పిన వెంటనే సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లు అద్భుతంగా స్పందించారని కొనియాడారు. తమ రాష్ట్రవాసులకు ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేస్తున్న పోరాటంలో తమ నుంచి మరింత సహకారం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu pjimage - 2020-03-27T204014.639


సీఎం పెమా ఖండు ట్వీట్‌కు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతను తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాల్సి ఉందన్నారు. అందరూ చేతులు కలిపి మరింత బలంగా మారుదామంటూ ట్వీట్ చేసింది.

కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌ డౌన్‌ పక్కాగా అమలు జరుగుతోంది. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.