యాప్నగరం

తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు.. సంచయితపై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

చట్ట విరుద్ధంగా అర్ధరాత్రి జీవోలో ఛైర్మన్‌గా తనను తొలగించారని.. తనకు కనీసం ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఛైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు.. ఆనవాయితీగా వచ్చే పోస్ట్ అని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 17 Nov 2020, 2:04 pm
విజయనగరం గజపతి రాజుల కుటుంబంలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జగన్ సర్కార్‌ మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజుకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆమెను తూర్పుగోదావరి జిల్లాల్లోని 104 ఆలయాలకు చైర్ పర్సన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఛైర్ పర్సన్‌గా అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఈ మేరకు నవంబర్ 2న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అశోక్‌గజపతిరాజు స్పందించారు. 105 ఆలయాల్లో ఒక్క ఫెస్టివల్కు సంచయిత హాజరవ్వలేదన్నారు అశోక్ గజపతి రాజు. చట్ట విరుద్ధంగా అర్ధరాత్రి జీవోలో ఛైర్మన్‌గా తనను తొలగించారని.. తనకు కనీసం ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఛైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు.. ఆనవాయితీగా వచ్చే పోస్ట్ అని వ్యాఖ్యానించారు. 37 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం జరగడం లేదని.. అన్ని దేవాలయాల్లో పూజలు జరిగేలా చూడాలన్నారు.
Samayam Telugu సంచయిత-అశోక్ గజపతి రాజు


సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్‌పైనా అశోక్ గజపతిరాజు ఘాటుగా స్పందించారు. చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్టు చేశారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులే మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి’అన్నారు. ఎవరో పెట్టిన పోస్టులకు తాను సమాధానం చెప్పడం ఖర్మ అన్నారు. ఒక్కో చోట ఒక్కో విధంగా తండ్రి పేరు మార్చే పిల్లలను తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.

తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు.. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదని మరో బాంబ్ పేల్చారు అశోఖ్. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరమని.. మాన్సాస్ ఛైర్మన్ హోదా అన్నది ప్రభుత్వం కల్పించిన పదవి కాదన్నారు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని.. ఆనవాయితీలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నదీ ప్రభుత్వం నిర్ణయించే ధోరణి సరికాదని.. ఆదాయం, ఆస్తి ఉన్న ఆలయాలపై ప్రభుత్వం కన్నేయటం బాధాకరమని వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.