యాప్నగరం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురి మృతి, ఆలయానికి వెళ్లొస్తుండగా ప్రమాదం

East Godavari జిల్లా ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 18 Aug 2019, 5:13 pm
గి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలో ఆదివారం (ఆగస్టు 18) మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. తునిలో తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్లి వస్తుండగా ధర్మపురం వద్ద ఎన్‌హెచ్-16పై ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu Representational Image


ప్రమాదంలో గాయపడిన వారిని ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.