యాప్నగరం

ఆనందయ్య మందు పంపిణీపై ఆయుష్ కమిషనర్ క్లారిటీ.. అప్పటి వరకూ.!

ఆనందయ్య నాటుమందు పంపిణీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆనందయ్య మందుపై అధ్యయనం కొనసాగుతోంది. మందు పంపిణీపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Samayam Telugu 28 May 2021, 9:17 pm
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా మందుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయుష్ శాఖ అధ్యయనం.. కోర్టు తీర్పులతో ఆనందయ్య మందు పంపినీకి అనుమతులు వస్తాయా? లేదా అనే అనుమానాలు రేగుతున్నాయి. ఆనందయ్య మందులో హానికర పదార్థాలేవీ లేవని ఇప్పటికే ఆయుష్ శాఖ చెప్పినప్పటికీ తుది నివేదిక వచ్చే వరకూ స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ayush


అదే విషయమై ఆయుష్ శాఖ కమిషనర్ రాములు స్పందించారు. ఆనందయ్య మందుపై అధ్యయనం కొనసాగుతోందని.. చివరి నివేదక రావాల్సి ఉందన్నారు. అటు కేంద్రం ఆధ్వర్యంలోని సీసీఆర్‌ఏఎస్ నివేదిక కూడా శనివారం వచ్చే అవకాశం ఉందని రాములు తెలిపారు. ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసిందని.. ఆయుష్ తుది నివేదిక, హైకోర్టు తీర్పును అనుసరించి నాటుమందు పంపిణీపై నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. అనుమతులు వస్తేనే పంపిణీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మందు పంపిణీపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశముంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.