యాప్నగరం

YSRCP ఎంపీ మంచి మనసు.. క్షతగాత్రుడికి చేయూత

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి చేయూత అందించారు. అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను హాస్పిటల్‌కు పంపించారు.

Samayam Telugu 5 Nov 2019, 4:14 pm
వైఎస్ఆర్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మంచి మనసు చాటుకున్నారు. బైక్ అదుపు తప్పి కింద పడటంతో.. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన సోమవారం రాత్రి గుంటూరు సమీపంలోని లాం ఫాం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంపీ నందిగం సురేష్ గుంటూరులో కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా.. లాం ఫాం వద్ద ఓ వ్యక్తి బైక్ మీది నుంచి కింద పడటాన్ని గమనించారు.
Samayam Telugu nandigam suresh


వెంటనే తన వాహనాన్ని ఆపిన ఎంపీ.. గాయపడిన వ్యక్తిని పైకి లేపి సపర్యలు చేశారు. ఫోన్ చేసి అంబులెన్స్‌ను పిలిపించింది.. అందులో ఎక్కించారు. అంబులెన్స్ వచ్చే వరకు క్షతగాత్రుడి వద్దే ఎంపీ ఉన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు బాపట్ల ఎంపీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎంపీ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ.. సీరియస్ మ్యాటర్
గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా రోడ్డు ప్రమాదం బారిన పడిన వారికి సపర్యలు చేశారు. అంబులెన్స్‌ను పిలిపించిన ఆమె.. స్వతహాగా డాక్టర్ కావడంతో చికిత్స అందించారు. ఏ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలో సూచించిన అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లారు.
Read Also: సీఎస్ బదిలీ.. దళిత క్రైస్తవ సంఘాల సంబరాలు.. జగన్‌కు చేటు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.