యాప్నగరం

BCG Report: అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌తో సరి.. విశాఖకే ప్రాధాన్యం.!

బోస్టన్ గ్రూప్ రిపోర్ట్‌తో అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన మళ్లీ తెరపైకి వచ్చింది. బీసీజీ సూచించిన రెండు ఆప్షన్లలోనూ ఆ విషయం స్పష్టమవుతోంది. అమరావతిపై చేసిన ప్రతిపాదనలదో రాజధాని తరలింపు లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 3 Jan 2020, 11:55 pm
ఏపీ రాజధాని ఎంపికపై అధ్యయనానికి నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) అందజేసిన నివేదికతో అమరావతిపై కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన.. జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే బీసీజీ రిపోర్ట్ కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీసీజీ అందజేసిన నివేదికలో ఆప్షన్‌-1, ఆప్షన్‌-2 కింద చేసిన సిఫార్సులు ఆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
Samayam Telugu bcg-report


ఇంతకీ ఆప్షన్-1లో ఏముందంటే.. విశాఖలో గవర్నర్, సీఎం కార్యాలయాలతో పాటు సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని బీసీజీ నివేదికలో సూచించింది. అలాగే విశాఖలో హైకోర్టు బెంచ్, అత్యవసర శాసనసభ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అమరావతి కేంద్రంగా అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, పలు కమిషనర్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

Also Read: నీ తాత తరం కూడా కాదు.. టీడీపీ ఎంపీ బస్తీ మే సవాల్

ఆప్షన్-2 కింద.. విశాఖలో సచివాలయం, సీఎం ఆఫీసు, ప్రభుత్వ శాఖలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషనర్లు, అప్పిలేట్ సంస్ఠలు ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. రెండు ఆప్షన్లలోనూ అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌కే పరిమితమైంది.

బోస్టన్ గ్రూప్ రిపోర్ట్‌తో అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన మళ్లీ తెరపైకి వచ్చింది. లెజిస్లేచర్ క్యాపిటల్‌గా అమరావతి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ.. జ్యుడీషియరీ క్యాపిటల్‌గా కర్నూలు ఉండొచ్చంటూ సీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికలోనూ అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు అంశాలు దాదాపుగా కనిపించాయి.

Read Also: రాజధానిపై రెండు ఆప్షన్లు.. విశాఖ, అమరావతి కోసం ఇలా..

తాజాగా బీసీజీ నివేదికలోనూ ఇంచుమించుగా అవే సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. తొలి ఆప్షన్‌లో అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. రెండో ఆప్షన్‌లోనూ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ అంశాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రకటనకు అనుగుణంగానే అమరావతిలో అసెంబ్లీ.. హైకోర్టు బెంచ్‌తో సరిపెడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సచివాలయం తరలింపు కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.