యాప్నగరం

ఏపీలో వణికిస్తున్న ఎలుగుబంట్లు.. ప్రకాశం జిల్లాలో ఒకరిపై దాడి

శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎలుగుబంట్లు కలకలం రేపిన ఘటనలు మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో ఎలుగుల సంచారం టెన్షన్ పెడుతోంది. ప్రకాశం జిల్లాలో తాజాగా ఒకరిపై ఎలుగుబంటి దాడి చేసి అడవిలోకి పారిపోయింది.

Authored byRaj Kumar | Samayam Telugu 25 Jun 2022, 9:51 am
ఏపీలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎలుగుబంట్లు కలకలం రేపిన ఘటనలు మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో ఎలుగుల సంచారం భయాందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ల గ్రామంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఎలుగుబంటిని అడవుల్లోకి తరిమేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే అది ఒకరిపై దాడి చేసి పారిపోయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే అంతకుముందు ఇదే జిల్లాలోని కొమరోలు మండలం తాటిచర్ల వద్ద ఐదు రోజుల నుంచి ఎలుగుబంటి సంచారం వెలుగు చూసింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు మూడ్రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇటు రాచర్ల మండలం గుడిమెట్ట వద్ద నిన్న రాత్రి గ్రామస్తులకు ఎలుగుబంటి కనిపించింది. దీంతో రెండు గ్రామాల్లో కనిపిస్తున్న ఎలుగుబంటి ఒకటేనా.. లేదంటే వేర్వేరా అన్న సందేహం కలుగుతోంది. ఈ క్రమంలోనే రెండు గ్రామాల్లో ఎలుగు బంటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వలలు, బోన్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ప్రజలకు ఎలుగుబంట్ల భయం పట్టుకుంది. ఎలుగుబంట్ల సంచారంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని కల్యాణదుర్గం మండలం ముదిగల్లు వాసులు ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజులుగా జంట ఎలుగుబంట్ల సంచారంతో ఇక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరికేయడం వల్ల అవి జనావాసంలోకి వస్తున్నాయి. ఎలుగుబంట్ల సంచారంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.