యాప్నగరం

ఏపీలో భారత్ బంద్ ప్రశాంతం.. రోడ్డెక్కని బస్సులు, పార్టీల ఆందోళనలు

తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు,వివిధ వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వివిధ రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి.

Samayam Telugu 8 Dec 2020, 11:28 am
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. భారత్‌బంద్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు,వివిధ వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వివిధ రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. విజయవాడ కాంగ్రెస్‌, వామపక్ష నేతల నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర కాంగ్రెస్‌, వామపక్ష నేతలు నిరసన తెలిపారు. బస్టాండ్‌ దగ్గర సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు, ఇతర నేతలు బైఠాయించారు.. పోలీసులు భారీగా మోహరించారు.
Samayam Telugu భారత్ బంద్


రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి.. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ బస్సులను నిలిపేయనున్నారు. గుంటూరు జిల్లాలోనూ బంద్‌ కొనసాగుతోంది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాయి. విశాఖపట్నంలోని మద్దెలపాలెంలో భారత్‌బంద్‌లో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.. కాకినాడలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాల నేతలు ప్రధాన రహదారులపై నిరసనలు కొనసాగిస్తున్నారు. రోడ్లపై టైర్లను కాల్చి ఆందోళన చేపట్టారు. మిగిలిన జిల్లాల్లో కూడా బంద్‌ కొనసాగుతోంది.. వామపక్షాలు, మిగిలిన పార్టీలు నిరసనలకు దిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.