యాప్నగరం

TDPకి ఉత్తరాంధ్రలో భారీ షాక్.. వైసీపీలోకి 3,000 మంది

Chandrababu Naidu: విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీలో దాదాపు 3 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరారు.

Samayam Telugu 9 Mar 2020, 8:40 pm
స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా వలసలు పెరిగాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఆదివారం, సోమవారాలు కలుపుకొని దాదాపు 3,000 మంది టీడీపీ నాయకులు, వారి అనుచరగణం, కార్యకర్తలు వైసీపీ గూటికి చేరారు. పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.
Samayam Telugu JOGARAO


Also Read: బీసీలకు సీఎం జగన్ వరం.. టీడీపీకి దిమ్మతిరిగేలా..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలకు అకర్షితులై వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నట్లు చెప్పారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.