జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ (Fan) గుర్తు, టీడీపీకి సైకిల్ (Cycle) గుర్తు, టీఆర్ఎస్ (TRS) పార్టీకి కారు (CAR) గుర్తులను రిజర్వుడ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. అలాగే, జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వుడు గుర్తులు ఉంటాయని పేర్కొంది. ఇక, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్ గుర్తులు కేటాయించింది.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది. అంటే, సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది.
గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీలకు కామన్ గుర్తుల్ని తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు.
వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించటమే కాకుండా.. అందుకు తగ్గట్లు కసరత్తు చేసింది. పవన్ పార్టీ బరిలో ఉంటే, తమ ఓట్లు చీలే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ కోరటంతో.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ఇప్పుడు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు గాజు గ్లాసును కామన్ సింబల్గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా.. తాము పోటీ నుంచి తప్పుకున్నామని.. తమకు తమ గాజు గ్లాస్ను కామన్ సింబల్గా కేటాయించాలని రిక్వెస్టు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. జనసేన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవటంతో తిరస్కరించినట్లుగా పేర్కొంది. దీంతో, 2025 నవంబర్ 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది. అంటే, సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది.
గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీలకు కామన్ గుర్తుల్ని తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు.
వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించటమే కాకుండా.. అందుకు తగ్గట్లు కసరత్తు చేసింది. పవన్ పార్టీ బరిలో ఉంటే, తమ ఓట్లు చీలే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ కోరటంతో.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ఇప్పుడు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు గాజు గ్లాసును కామన్ సింబల్గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా.. తాము పోటీ నుంచి తప్పుకున్నామని.. తమకు తమ గాజు గ్లాస్ను కామన్ సింబల్గా కేటాయించాలని రిక్వెస్టు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. జనసేన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవటంతో తిరస్కరించినట్లుగా పేర్కొంది. దీంతో, 2025 నవంబర్ 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.