యాప్నగరం

జగన్‌కు బీహార్ సీఎం ఫోన్.. స్పెషల్ రిక్వెస్ట్

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి అంశాలపై చర్చించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కి మద్దతు పలకాలని కోరారు.

Samayam Telugu 11 Sep 2020, 9:36 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. గురువారం రాత్రి ఫోన్ చేసిన నితీష్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి అంశాలపై చర్చించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కి మద్దతు పలకాలని కోరారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. నితీష్ రిక్వెస్ట్‌పై జగన్ ఎలా స్పందించారన్నది తెలియాల్సి ఉంది.
Samayam Telugu సీఎం జగన్


సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అక్టోబర్‌ ఒకటి వరకు సెషన్స్ కొసాగనున్నాయి. రాజ్యసభ సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్‌ మరోసారి పోటీలో ఉన్నారు. మరి వైఎస్సార్‌సీపీ ఎలాంటి వ్యూహంత ముందుకు వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.