యాప్నగరం

ఇంగ్లిష్ మీడియం వెనుక మతపరమైన కుట్ర.. జగన్‌ సర్కారుపై కన్నా ఆరోపణలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరపాలన్న జగన్ సర్కారు నిర్ణయం వెనుక మతపరమైన కుట్ర ఉందని కన్నా ఆరోపించారు.

Samayam Telugu 11 Nov 2019, 8:43 pm
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలోనే బోధన దిశగా ఏపీ సర్కారు అడుగులేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. ఈ విషయమై తాజాగా బీజేపీ స్పందించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. తాము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదన్నారు. కానీ భాషా, సాంస్కృతులను కాపాడాలన్నారు. భాషను బలవంతంగా రుద్ద వద్దని హితవు పలికారు. ప్రభుత్వ పరంగా తెలుగును విస్మరిస్తాం అంటే కుదరదన్నారు.
Samayam Telugu kanna


ఆప్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న కన్నా.. ఇంగ్లీషు భాషలో విద్యా విధానం అమలు వెనుక మతపరమైన కుట్ర ఉందని జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్మకి, మమ్మీకి మధ్య ఉన్న తేడాతో సంస్కృతి మొత్తం మారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: జగన్ నిర్ణయం భేష్.. ఇక చదువు ‘కొనక్కర్లేదు’

ఒక మతాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన జగన్ సర్కారును హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేసినా సంఘీభావం ప్రకటిస్తామన్న కన్నా.. ప్రజా సమస్యలపై బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందన్నారు.

Read Also: కడపలో పుట్టి.. ఇలాంటి నిర్ణయమా?: పవన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.