యాప్నగరం

బీజేపీకి భారీ షాక్.. వైసీపీలోకి అమిత్ షా సన్నిహితుడు

ఆయనకు బీజేపీ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

Samayam Telugu 8 Dec 2019, 9:51 pm
ఏపీలో అసలే అంతంతమాత్రంగా ఉన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఏపీకి చెందిన కీలక నేత బీజేపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కమలం పార్టీ నుంచి ఫ్యాన్ గాలి కింద సేదతీరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గోకరాజు సహా ఆయన కుటుంబంతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన సోమవారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని సమాచారం.
Samayam Telugu amit


2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున నర్సాపురం ఎంపీ గెలిచారు. ఆయనకు బీజేపీ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా ఉండేవారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అమిత్ షా ఎప్పుడు ఏపీ పర్యటనకు వచ్చినా కృష్ణా కరకట్టపై ఉన్న గోకరాజు అతిథి గృహంలోనే దిగేవారు.

Also Read: వామ్మో!! కిలో ఉల్లికి అంత సబ్సిడీనా.. ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

అయితే గోకరాజు గంగరాజు వ్యవహారం కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పటి వరకు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ లీకులు వదులుతున్న బీజేపీకి గోకరాజు వ్యవహారంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టైంది. బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కడతారని చెబుతున్న తరుణంలో తాజా సంఘటన కమలనాథులకు భారీ షాక్ అనే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.