యాప్నగరం

రఘురామ అనుమానాస్పద మృతి చెందేవారు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కార్‌లో తిట్టినోళ్లకే పదువులు వస్తాయి. అసెంబ్లీలో రఘురామరాజుపై రెచ్చిపోయిన జోగి రమేష్‌కి క్యాబినెట్ బెర్త్ పక్కా అయినట్టేనని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు.

Samayam Telugu 23 May 2021, 7:26 pm
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సీఐడీ ఎంపీ రఘురామను రాజద్రోహం కేసులో అరెస్టు చేసి జైలుకి తరలించడం.. సుప్రీం బెయిల్ తదనంతర పరిణామాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎంపీలు, మంత్రులు రఘురామను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
raghurama


ఈసారి క్యాబినెట్ విస్తరణలో ఎమ్మెల్యే జోగి రమేష్‌కి మంత్రి పదవి ఖాయమని విష్ణు జోస్యం చెప్పారు. తిట్టినోళ్లకే జగన్ ప్రభుత్వంలో పదవులు వస్తాయని.. అసెంబ్లీలో ఎంపీ రఘురామను బూతులు తిడితే సీఎం థ్యాంక్స్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రఘురామను కస్టడీలో కొట్టిన వారికి కూడా ప్రమోషన్లు వస్తాయని అన్నారు.

అంతటితో ఆగని విష్ణుకుమార్ రాజు మరో అడుగు ముందుకేసి రఘురామను జైలుకి తీసుకెళ్లి ఉంటే అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండేవారని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌పై తనకు చాలా గౌరవం ఉందని విష్ణుకుమార్ రాజు అన్నారు. లేకుంటే తనను కూడా లోపలేస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపీ రఘురామ వ్యవహారంలో ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.