రాయలసీమ డిక్లరేషన్కు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాయలసీమ హక్కుల సాధనకు బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. రాయలసీమ విద్యార్థి సంఘాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విష్ణు తెలిపారు. రాయలసీమలో రాష్ట్ర రెండో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో బీజేపీకి ఒక్క సీటు రాకపోయినా హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే రాయలసీమ ప్రజలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విష్ణు ఆక్షేపించారు. రాయలసీమ రౌడీలు, గూండాలు అంటూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జగన్ కూడా చంద్రబాబు దారిలోనే సాగుతున్నారని ఆయన విమర్శించారు. జగన్, చంద్రబాబు రాయలసీమలో పుట్టడం సీమ దౌర్భాగ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరూ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: కాపురం చేయాలన్నా జే ట్యాక్స్ కట్టాలేమో! జగన్ సర్కార్పై చంద్రబాబు హాట్కామెంట్స్
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణమే సీఎం జగన్ స్పందించాలన్నారు. లేకుంటే చంద్రబాబు మాదిరిగానే రాయలసీమ ద్రోహిగా భావిస్తామన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. కేంద్రం మంజూరు చేసిన ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ రంగులు వేస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రాంతంలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని బీజేపీ డిక్లరేషన్ ఇచ్చిందని విష్ణు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోడం సరికాదన్నారు. కచ్చితంగా ఇక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని విష్ణు అన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ, టీడీపీ, మిగిలిన పార్టీలు కూడా నోరుమెదపాలని, లేకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే రాయలసీమ ప్రజలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విష్ణు ఆక్షేపించారు. రాయలసీమ రౌడీలు, గూండాలు అంటూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జగన్ కూడా చంద్రబాబు దారిలోనే సాగుతున్నారని ఆయన విమర్శించారు. జగన్, చంద్రబాబు రాయలసీమలో పుట్టడం సీమ దౌర్భాగ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరూ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: కాపురం చేయాలన్నా జే ట్యాక్స్ కట్టాలేమో! జగన్ సర్కార్పై చంద్రబాబు హాట్కామెంట్స్
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణమే సీఎం జగన్ స్పందించాలన్నారు. లేకుంటే చంద్రబాబు మాదిరిగానే రాయలసీమ ద్రోహిగా భావిస్తామన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. కేంద్రం మంజూరు చేసిన ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ రంగులు వేస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రాంతంలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని బీజేపీ డిక్లరేషన్ ఇచ్చిందని విష్ణు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోడం సరికాదన్నారు. కచ్చితంగా ఇక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని విష్ణు అన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ, టీడీపీ, మిగిలిన పార్టీలు కూడా నోరుమెదపాలని, లేకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.