యాప్నగరం

'చంద్రబాబుతో పాటూ లోకేష్‌ జైలుకెళ్లడం ఖాయం'

మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు ఇద్దరూ బీజేపీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. టీడీపీలో ఆ ముగ్గురు తప్ప ఇంక ఎవరూ మిగలరు. చంద్రబాబు ఊసరవెల్లిలా మారిపోయారు.

Samayam Telugu 4 Aug 2019, 4:20 pm
టీడీపీలో చంద్రబాబు, లోకేష్, బాలయ్య తప్ప ఎవరూ మిగలరంటున్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని.. ఇరిగేషన్ శాఖ 60(సీ)ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు, లోకేష్ నేరుగా అక్రమాలు చేశారని ఆరోపించారు. పోలవరంపై మాట్లాడే హక్కు టీడీపీ కోల్పోయిందని.. పాత ధరలకే పోలవరం రీ- టెండర్లు వేయాలని లేకపోతే ప్రాజెక్ట్ కష్టాల్లో పడుతుందన్నారు. పోలవరం అవినీతిపై వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపితే చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన విష్ణు టీడీపీ, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
Samayam Telugu babu lokesh


రాయలసీమపై వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏమిటో చెప్పాలన్నారు విష్ణు. రాయలసీమ డిక్లరేషన్‌పై వైసీపీ నిష్పక్షపాతంగా వ్యవహారించాలని.. లేనిపక్షంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. మళ్లీ కొత్త రాష్ట్ర ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష బయటకు వస్తుందన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో కర్నూలు జిల్లా రైతులు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఆరు వేలు, వైసీపీ రూ. 12500 ఇస్తేనే రాయలసీమ రైతులు బతకగలరన్నారు.

ఇటు ఏపీ బీజేపీ సునీల్ దియోధర్ ఇంఛార్జ్ టీడీపీ, వైసీపీ టార్గెట్‌గా మండిపడ్డారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారన్నారు. ఏపీలో వైసీపీ ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని.. టీడీపీ, వైసీపీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పార్టీని పెడితే.. చంద్రబాబు కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.