యాప్నగరం

YSRCP తో పొత్తుపై బీజేపీ సంచలన ప్రకటన.. గత రెండేళ్లుగా..!

కేంద్ర మంత్రివర్గంలోకి ఏపీలోని అధికార వైసీపీ చేరబోతున్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది.

Samayam Telugu 11 Aug 2021, 3:29 pm
కేంద్ర కేబినెట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంచలన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రౌడీల పార్టీ అయిన వైసీపీతో ఎలాంటి పొత్తుకు ప్రయత్నించలేదని తేల్చి చెప్పింది.
Samayam Telugu వైసీపీతో పొత్తుపై బీజేపీ ప్రకటన


ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ జగన్ సర్కారుపై ఎలాంటి పోరాటాలు చేయకపోయినా తాము గత రెండేళ్లుగా అనేక ధర్నాలు చేపట్టినట్లు బీజేపీ తెలిపింది. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో బుధవారం ట్వీట్ చేశారు.


‘‘మేము ఆంధ్రప్రదేశ్ లో రౌడీల పార్టీ వైసీపీతో ఎలాంటి పొత్తుకు ప్రయత్నించలేదు. దీనికి విరుద్ధంగా, మరో కుటుంబ పార్టీ టీడీపీ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజల తరపున ఎలాంటి పోరాటాలు చేయనప్పటికీ, జగన్ గారి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అనేక ధర్నాలను నిర్వహించాము.’’ అని బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఇటీవలే.. బీజేపీ తమను కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానించిందని వెల్లడించారు. ఈ క్రమంలో జోరుగా ఊహాగానాలు సాగగా.. తాజాగా, బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.