Bjp Maintaining Strategically Maintaining Relations With Andhra Political Parties Ysrcp, Tdp And Janasena
Andhra Politics: అంతుపట్టని బీజేపీ గేమ్ ప్లాన్.. మూడు పార్టీలతో మూడు ముక్కలాట
ప్రస్తుత రాజకీయాల్లో.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడంలో, అవకాశాలను సృష్టించుకోవడంలో బీజేపీ తర్వాతే ఏ పార్టీ అయినా అని చెప్పడం అతిశయోక్తి కాదు. బీజేపీ గేమ్ ప్లాన్ మిగతా పార్టీలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏపీలో బలపడాలని, వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం ఆపరేషన్ కమలానికి తెరతీసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. టీడీపీ, జనసేనలకు చెందిన నేతలకు కమలం పార్టీ వల విసిరింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమవైపు తిప్పుకుంది.
Samayam Telugu12 Jan 2020, 12:41 pm
ప్రస్తుత రాజకీయాల్లో.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడంలో, అవకాశాలను సృష్టించుకోవడంలో బీజేపీ తర్వాతే ఏ పార్టీ అయినా అని చెప్పడం అతిశయోక్తి కాదు. బీజేపీ గేమ్ ప్లాన్ మిగతా పార్టీలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏపీలో బలపడాలని, వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం ఆపరేషన్ కమలానికి తెరతీసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. టీడీపీ, జనసేనలకు చెందిన నేతలకు కమలం పార్టీ వల విసిరింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమవైపు తిప్పుకుంది.
మూడు పార్టీలతో టచ్లో..
టైంకి తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకునే బీజేపీ.. ఏపీకి చెందిన రాజకీయ పార్టీలతో వ్యవహరిస్తున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీతో సఖ్యతగా మెలుగుతూనే.. ప్రతిపక్షంలో ఉన్న జనసేన, బీజేపీలతోనూ ఆ పార్టీ టచ్లో ఉంటోంది.
అమరావతి విషయంలో..
ఎన్నికల వేళ మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ నేతలకు ఇప్పటికీ ఆయనంటే కోపం ఉంది. చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ కాలం గడిచే కొద్దీ.. టీడీపీ విషయంలో బీజేపీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కేంద్రం విడుదల చేసిన ఇండియా మ్యాప్లో ఏపీ రాజధానిని పేర్కొనలేదు. దీంతో టీడీపీ ఎంపీలు ఈ విషయమై ఆందోళనకు దిగారు, వెంటనే అమరావతిని మ్యాప్లో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందనగా కేంద్రం వెంటనే అమరావతితో కూడిన మ్యాప్ను రిలీజ్ చేసింది. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించింది.
వైఎస్సార్సీపీ పట్ల సానుకూలంగానే..
తాజాగా సీబీఐ జేడీ నియామకం విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఏపీకి సంబంధం లేని అధికారిని నియమించాలని కేంద్రానికి లేఖ రాశారు. దీనికి స్పందించిన అమిత్ షా.. విజయ సాయి వినతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పార్లమెంట్లో కీలక బిల్లుల ఆమోదం విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ బీజేపీకి మద్దతు ఇచ్చాయి.
జనసేనాని స్పెషల్..
ఇక పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీ పట్ల అంతగా ఆసక్తి చూపని జనసేనాని కూడా.. ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన పవన్.. తాజాగా మరోసారి హస్తిన వెళ్లారు. గతంలో ఆయన ఎవరిని కలిశారనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలను ఆయన కలుస్తారని ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీలతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో.. ఆ పార్టీ వ్యూహం ఏంటనేది అర్థం కావడం లేదు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.