యాప్నగరం

'బాలయ్యతో మోదీని తిట్టించింది నువ్వు కాదా బాబూ'

Chandrababu Naidu| 'గతం మర్చిపోయావా చంద్రబాబు.. గల్లా జయదేవ్, బాలయ్యతో ప్రధాన మంత్రి మోదీని తిట్టించింది నువ్వే కదా.. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరడానికి ప్రయత్నాలా'

Samayam Telugu 17 Oct 2019, 3:41 pm
బీజేపీతో జత కలిసేందుకు చంద్రబాబు మళ్లీ దారులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. బీజేపీ బలోపేతం కావడంతో చంద్రబాబులో భయం పెరిగిందని.. అందుకే మళ్లీ మాట మార్చారని ఆరోపించారు. ప్రధాని మోదీపై వ్యక్తిగత విబేధాలు లేవని చెబుతున్న చంద్రబాబు.. గతం మర్చిపోకూడదన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu bala


Read Also: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి జగన్ సర్కార్ షాక్!

మోదీ మెడలు వంచుతామని చంద్రబాబు అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు వీర్రాజు. గల్లా జయదేవ్, బాలకృష్ణతో విమర్శలు చేయించింది.. రాజధాని శంఖుస్థాపనకు పవిత్ర జలాలు తెస్తే కించ పరచలేదా అంటూ ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు కొనసాగుతున్న సమయంలోనే.. మోదీ దిష్టి బొమ్మల్ని దగ్థం చేయించారని.. మోదీని తిట్టడానికి ధర్మ పోరాట దీక్షల పెట్టించారని ఆరోపించారు.

గతంలో టీడీపీ ప్రభుత్వ సొమ్ము పప్పు బెల్లంలా పంచిపెట్టిందని.. ఎన్నికల్లో మాత్రం 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు సోము. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ కూడా అదే దారిలో నడుస్తోందని.. వాళ్లకు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టిన గతే అంటూ ధ్వజమెత్తారు. ఇక ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడంపై మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.