యాప్నగరం

సీఎం జగన్‌ను కలిసిన సీఎం రమేశ్.. అంతకు ముందే మోదీతో భేటీ!

సీఎం జగన్‌తో బీజేపీ నేత సీఎం రమేశ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఛాంబర్‌లో కుటుంబ సమేతంగా ఆయన జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.

Samayam Telugu 27 Jan 2020, 1:31 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కలిశారు. అసెంబ్లీ లాబీలోని సీఎం ఛాంబర్‌లో కుటుంబ సమేతంగా జగన్‌ను కలిసిన ఆయన.. సీఎంకు తన కుమారుడి పెళ్లి శుభ లేఖను అందించారు. త్వరలో జరిగే తన కొడుకు పెళ్లికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇటీవలే ఆయన కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసి తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరారు. పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్‌ నిశ్చితార్థం కొద్దిరోజుల కిందటే దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 7న రిత్విక్, పూజ వివాహం జరగనుంది.
Samayam Telugu cm jagan cm ramesh


రిత్విక్ వివాహానికి జగన్, కేసీఆర్‌తోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులందరితోపాటు, బీజేపీకి చెందిన జాతీయ నేతలను సీఎం రమేశ్ ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రమేశ్ కుమారుడి ఎంగేజ్‌మెంట్‌ను అంత్యంత ఆడాంబరంగా దుబాయ్‌లో నిర్వహించారు. 17 ప్రత్యేక విమానాల్లో అతిథులను తీసుకెళ్లారని వార్తలొచ్చాయి. మొత్తం 75 మంది ఎంపీలను ఆయన ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి.

ఇటీవల జరిగిన కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ సీఎం జగన్‌ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కలిశారు. ఇప్పుడు మరోసారి ఆయన సీఎం జగన్‌ను కలవడం విశేషం. ఈ రెండూ రాజకీయాలతో సంబంధం లేని భేటీలే కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.