యాప్నగరం

ఆ విషయాల్లో జగన్‌దే నిర్ణయం.. కేంద్రం జోక్యం చేసుకోదు: జీవీఎల్

రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.

Samayam Telugu 19 Sep 2019, 12:34 pm
ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఉండాలనేది రాష్ర్ట ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌దే నిర్ణయమని, ఆ విషయంలో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమని జీవీఎల్ అన్నారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసిందని విమర్శించారు.
Samayam Telugu AP_High_Court


రాజధాని అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. ఆ నిధులను రాయలసీమ అభివృద్ధికి ఖర్చు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శలు చేశారు. కేంద్రం నిధులకు లెక్కలు చెప్పమంటే టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని జీవీఎల్ ఆరోపించారు.

Must Read: టార్గెట్ సుజనా.. జగన్ సర్కార్‌ రహస్య విచారణ!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఉదంతంపై జీవీఎల్ స్పందించారు. కోడెల చాలా ధైర్యవంతుడని, ఆయన అలా ఆత్మహత్య చేసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. సీనియర్ నేత కోడెల మరణంపై రాజకీయాలు చేయడం తగదన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని జీవీఎల్ కోరారు.

Also Read: ‘ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు?’ చంద్రబాబుపై అంబటి ఫైర్

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను ఉద్దేశించి జీవీఎల్ మాట్లాడుతూ బీజేపీలో చేరినంత మాత్రాన కేసులు మాఫీ అయిపోవన్నారు. పార్టీలో చేరితే కేసులు మాఫీ చేస్తామని ఎవ్వరికీ హామీ ఏమీ ఇవ్వలేదన్నారు. కేసులకు, పార్టీలో చేరడానికి సంబంధం లేదన్నట్లు జీవీఎల్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.