ఏపీలో ఓ జిల్లాకు, విజయవాడ ఎయిర్పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలి: జీవీఎల్
ఏపీలోని ఓ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. అలాగే, విజయవాడ ఎయిర్పోర్ట్కు రంగా పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ఓ జిల్లాకు దివంగత వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడుతూ, వంగవీటి రంగా గురించి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన రంగా గురించి తెలియని వారు ఉండరన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వంగవీటి రంగాను ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు.
ఏపీలో అత్యంత పెద్ద కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి వంగవీటి రంగాను కొందరు ద్రోహులు 1986 డిసెంబర్ నెలలో హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంగవీటి రంగా ఓ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో.. రాష్ట్రవ్యాప్తంగా ‘కాపునాడు’ సభలను నిర్వహిస్తున్న టైంలో ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు.
వంగవీటి రంగా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను ప్రజలు స్మరించుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి అయిన వంగవీటి రంగా పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ, వంగవీటి రంగా పేరును మాత్రం పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక దానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని జీవీఎల్ పేర్కొన్నారు.
ఏపీలో అత్యంత పెద్ద కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి వంగవీటి రంగాను కొందరు ద్రోహులు 1986 డిసెంబర్ నెలలో హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంగవీటి రంగా ఓ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో.. రాష్ట్రవ్యాప్తంగా ‘కాపునాడు’ సభలను నిర్వహిస్తున్న టైంలో ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు.
వంగవీటి రంగా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను ప్రజలు స్మరించుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి అయిన వంగవీటి రంగా పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ, వంగవీటి రంగా పేరును మాత్రం పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక దానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని జీవీఎల్ పేర్కొన్నారు.