యాప్నగరం

వేసిన క్యాసెట్టే మళ్లీ మళ్లీ ఎన్నాళ్లు వేస్తారు.. జగన్?: ఎంపీ జీవీఎల్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సెటైర్లు వేశారు. మూడు రాజధానులపై గత మూడేళ్లుగా వేసిన క్యాసెట్టే మళ్లీ మళ్లీ వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 15 Sep 2022, 11:48 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకుండా పరిపాలన రాజధాని అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు విమర్శించారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేఖలు రాస్తున్నా జగన్ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. ఒక్క ఆధారమైన బయటపెట్టారా అని నిలదీశారు.
Samayam Telugu జీవీఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)


ఈ మేరకు ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసన్నారు. అయినా కూడా మూడేళ్ల క్రితం వేసిన క్యాసెట్టే మళ్లీ మళ్లీ వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నంలో ఎందుకు రాజధాని పెడతామన్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. విశాఖలో కొత్తగా ల్యాండ్‌ స్కామ్‌లు చేయాలనా అని నిలదీశారు. విశాఖపట్నం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సహకారాలు రావాలని.. కానీ, అలా జరగట్లేదని విమర్శించారు. నిజమైన అభివృద్ధి కావాలంటే విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్ నిర్మాణం ఎందుకు నత్తనడకన నడుస్తోందని జీవీఎల్‌ నిలదీశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.