యాప్నగరం

Pawan Kalyan ‌కు బీజేపీ బిగ్ షాక్.. తిరుపతి ఉప ఎన్నికపై ఎంపీ సంచలన ప్రకటన

Tirupati By Election: తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీపై ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 24 Nov 2020, 10:27 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బిగ్ షాక్ ఇచ్చేలా ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్న జనసేనానికి మిత్ర పార్టీ బీజేపీ ఝలక్ ఇచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తేల్చి చెప్పారు. తిరుపతిలో తామే పోటీ చేస్తామని వెల్లడించారు. తమ పార్టీ గతంలో తిరుపతిలో ఎంపీ స్థానంలో గెలిచిందని ఆయన గుర్తు చేశారు. దీంతో తిరుపతిలో పోటీపై బీజేపీ పూర్తిగా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా తిరుపతిలో బీజేపీ క్షేత్రస్థాయిలో పని చేస్తోంది.
Samayam Telugu ఢిల్లీలో ప్రెస్మీట్ (ఫైల్ ఫొటో)


మంగళవారం కూడా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జిల్లా ముఖ్య నాయుకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలో చేర్చుకున్నారు.

ఇక బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ‌కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. సోమవారమే ఢిల్లీ చేరుకున్న పవన్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ అగ్ర నేతలతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భేషరతుగా బీజేపీ మద్దతు ఇచ్చారు. తమ అభ్యర్థులను కూడా పోటీ నుంచి నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇందుక ప్రతిఫలంగా తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ అగ్రనాయకులను అడిగేందుకే పవన్‌ ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమయంలోనే జీవీఎల్ నరసింహారావు తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుందని వెల్లడించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.