యాప్నగరం

జగన్ గారూ.. ఇబ్బందులు తప్పవు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. లేని వ్యవస్థపై ఇంకా మాట్లాడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Samayam Telugu 5 Feb 2020, 3:05 pm
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి లేఖ రాయడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తీవ్రంగా స్పందించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదా అనే లేని వ్యవస్థపై ఇంకా మాట్లాడితే గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా రాజకీయంగా ఇబ్బందులు పడతారని సీఎం జగన్‌ను హెచ్చరించారు. హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత సర్కార్‌లా వైసీపీ మెడకు చుట్టుకుంటుందన్నారు.
Samayam Telugu jagan1


Also Read: ‘ఎవరైనా నా కులం అడిగితే.. ఆంధ్రప్రదేశ్ అని చెప్తా’

ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు బదులుగా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా రూ.22 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రానికి ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఉద్దేశం లేదని జీవీఎల్‌ స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని సీఎం జగన్‌కు కూడా తెలుసునని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదని, కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుందన్నారు. అయితే అమరావతిని మార్చడం సరికాదని బీజేపీ రాజకీయ తీర్మానం చేసిందని గుర్తు చేశారు.

Also Read: త్వరలో మీ రాజకీయ జీవితాలు క్లోజ్.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.