యాప్నగరం

మండలి రద్దుకు కేంద్రం పచ్చ జెండా..! బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్దంగానే ముందుకు వెళ్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ బిల్లుపై కేంద్రం జాప్యం చేయబోదని చెప్పారు.

Samayam Telugu 29 Jan 2020, 6:18 pm
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు.
Samayam Telugu gvl


Also Read: మండలి రద్దుపై మరో కీలక ఘట్టం.. ఇక రెండడుగులే!

మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. ఆలస్యం చేయడం, తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండబోవన్నారు. మండలి రద్దు తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

Also Read: YS Jagan ఫొటో మాత్రమే గ్రామ సచివాలయంలో.. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలు చెత్తకుప్పలోకి!?

169 (1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానం చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇందులో తాము చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కొందరు కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామని జీవీఎల్ తెలిపారు. తమ పార్టీకి మంచి జరుగుతుందనో, చెడు జరుగుతుందనో చూడట్లేదని.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం అడుగులు వేస్తుందని ఆయన వివరించారు.

Also Read: శాసన మండలి రద్దు.. ఆ ఇద్దరూ ఇక పక్కన కూర్చోవాల్సిందే: స్పీకర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.