యాప్నగరం

TTDపై అసత్య ప్రచారం.. పరువు నష్టం దావా, బాబును టార్గెట్ చేసిన సుబ్రమణ్య స్వామి

తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా చేస్తానని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థపై హైకోర్టులో ఆయన రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నారు.

Samayam Telugu 10 Mar 2021, 11:37 am
టీటీడీపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పష్టం చేశారు. తమిళనాడులో నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ ఆధిపత్యం లేకుండా చేశానన్నారు. ఆలయ నిర్వహణలో ప్రభుత్వానికి సంబంధం లేదని సుబ్రణ్యస్వామి vs తమిళనాడు స్టేట్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. 4 లక్షల ఆలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయని.. మసీదులు, చర్చిలపై ప్రభుత్వాల పర్యవేక్షణ లేదన్నారు.
Samayam Telugu tirumala-subramanian swamy


గత కొంత కాలంగా తిరుమల ఆలయంపై అసత్య ప్రచారం జరుగుతోందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. టీటీడీలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిందని.. ఆ మీడియా సంస్థపై ఇవాళ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానన్నారు.

జగన్ సీఎం అయ్యాక.. టీటీడీపై అసత్య ప్రచారం ఎక్కువైందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. తిరుమల వేంకటేశ్వర స్వామిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తాను హైకోర్టుకు వెళ్తానన్నారు. చంద్రబాబు హయాంలో టీటీడీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు.

గత ఐదేళ్లకు సంబంధించి టీటీడీ అకౌంట్లను కాగ్‌తో ఆడిట్ చేయించాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ న్యూస్ అవుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.