యాప్నగరం

'YSRCPకి వచ్చిన ఓట్లకంటే.. ఆ ఫిర్యాదులే ఎక్కువ'

సమస్యల్ని పరిష్కరించవల్సిన ప్రభుత్వమే.. సమస్యల్ని సృష్టిస్తోంది. ఇక ప్రతిక్షంగా టీడీపీ విఫలమయ్యింది. రాబోయే రోజుల్లో ఏపీలోనూ బీజేపీ బలోపేతం అవుతుంది.

Samayam Telugu 16 Oct 2019, 7:18 pm
ఏపీలో దూకుడు పెంచింది బీజేపీ. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన కమలనాథులు.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. ఈ యాత్రల్లో ఏపీ బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. పనిలో పనిగా.. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్షం టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా జగన్ సర్కార్‌పై సెటైర్లు పేల్చారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.
Samayam Telugu sujana


Read Also: 'విజయసాయి గారూ.. ఢిల్లీ నుంచి వస్తే రెండు దోమల బ్యాట్‌లు తెచ్చుకోండి'

ముఖ్యమంత్రి జగన్ ఇతర పార్టీ నేతలను టార్గెట్ చేయడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు సుజనా. పోలవరం రివర్స్ టెంటరింగ్‌పై కేంద్రం, హైకోర్టు హెచ్చరించినా.. జగన్ పట్టించుకోలేదని.. సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందన్నారు. వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే.. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై గ్రీవేన్స్ సెల్ ఏర్పాటు చేస్తే వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

అధికారం ఉందని జగన్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరించకూడదని.. పోలవరాన్ని చంద్రబాబు ఐదేళ్లు జాప్యం చేస్తే.. జగన్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా పట్టించుకోలేదన్నారు. ఇక ప్రతిపక్షంగా టీడీపీ విఫలమయ్యిందన్నారు.. రాబోయే రోజుల్లో ఏపీలోనూ బీజేపీ బలపడుతుందన్నారు సుజనా చౌదరి. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.