యాప్నగరం

సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయం.. సుజనా సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 25 Sep 2019, 6:40 pm
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. చంద్రబాబు ఇంకా కృష్ణా కరకట్టపై ఎందుకు నివాసం ఉంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అద్దె ఇల్లు ఖాళీ చేయొచ్చుగా అని వ్యాఖ్యానించారు. తానైతే ఆ ఇంట్లో నివాసం ఉండేవాడిని కాదని స్పష్టం చేశారు. ఆ ఇంటిని ప్రభుత్వం కూల్చివేస్తే సానుభూతి పొందాలని చూస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. అటు జగన్ ప్రభుత్వంపైనా సుజనా విమర్శల వర్షం కురిపించారు.
Samayam Telugu HY04TDP_


రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యమవుతాయని సుజనా అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ప్రాజెక్టును ఆలస్యం చేసిందని, ఇప్పుడు జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో మరో మూడేళ్లు ఆలస్యమవుతుందని చెప్పారు. తూతూమంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్ చేపట్టారని విమర్శించారు. ఐదారువేల కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశాలున్నాయని సుజనా సందేహాలు వ్యక్తం చేశారు.

Also Read:రైతులు, డ్వాక్రా మహిళలకు శుభవార్త.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రివర్స్ టెండరింగ్ విధానంతో వందల కోట్లు ఆదా చేసినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని సుజనా అన్నారు. ఎంత నిధులు ఆదా చేశారు? ఎలా చేశారు? వంటి విషయాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు టెండర్లలో అవినీతిని అరికట్టామని చెబుతున్నారని, ఎలా అరికట్టారో చెప్పాలన్నారు. గతంలో ఎల్ 2గా వచ్చిన ఇంజనీరింగ్ సంస్థ, ఇప్పుడు తన బిడ్ ను తగ్గించి వేయడంలో ఉద్దేశం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. టెక్నికల్ బిడ్ కాకపోవడంతో ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదని సుజనా వ్యాఖ్యానించారు.

Read Also:
చంద్రబాబు నివాసం కూల్చివేతలో ట్విస్ట్.. హైకోర్టుకు లింగమనేని

పీపీఏల పున:సమీక్ష అంశంపై సుజనా స్పందించారు. జగన్ ప్రభుత్వ వ్యవహారశైలితో రాష్ట్రానికి పెట్టుబడులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్నారు. ఇప్పటికే బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వట్లేదని, జగన్ తీరుతో దేశానికే చెడ్డపేరు వస్తోందని విమర్శలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.