యాప్నగరం

YS Jagan మొండి, అనుకున్నది చేస్తారు.. కేసీఆర్‌తో జాగ్రత్త: ఎంపీ టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు

KCR| ఏపీకి నాలుగు రాజధానులంటూ సంచలనానికి తెరలేపిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. మంగళగిరిలో లోకేష్ ఓటమి.. కేసీఆర్, జగన్‌ల దోస్తీపైనా సంచలన వ్యాఖ్యలు.

Samayam Telugu 25 Aug 2019, 8:52 pm
ఏపీ రాజధానిపై వివాదం నడుస్తున్న వేళ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి 4 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని.. అమరావతిపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే కేంద్రానికి చెప్పారంటూ కొత్త బాంబ్ పేల్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనగా అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంగళగిరిలో లోకేష్ ఓటమిపై టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu kcr


Don't Miss: టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. బాలయ్య అల్లుడి షాకింగ్ కామెంట్స్

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. అమరావతి రైతుల నుంచి చంద్రబాబు అన్యాయంగా భూములు లాక్కొన్నారనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారన్నారు వెంకటేష్. రైతుల కడుపు కొట్టారని.. అసలు భవనాల నిర్మాణానికి అమరావతి సరైన ప్రాంతం కాదని గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు అమరావతి రాజధాని సరైన ప్రాంతం కాదని.. రైతులకు భూములు వెనక్కు ఇవ్వాలనే డిమాండ్ వినిపించారన్నారు. జగన్ అదే డిమాండ్‌తో ఎన్నికలకు వెళ్లారని.. ప్రజలు అంగీకరించి గెలిపించారన్నారు.

ఈ సందర్భంగా ఓ ఉదాహరణను చెప్పుకొచ్చారు టీజీ. మంగళగిరిలో సాక్షాత్తూ చంద్రబాబు కుమారుడు లోకేష్ ఓడిపోయారని.. ‘ఆయన ఎందుకు ఓడిపోయాడంటే జగన్ గారి కమిట్‌మెంట్ నమ్మి ప్రజలు ఓట్లు వేశారు’అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాబట్టి జగన్ ఇప్పటికీ నమ్మక ద్రోహం చేయనని చెప్పొచ్చు.. రాజధాని తరలించొద్దని మనసులో ఉండొచ్చన్నారు. జగన్ మొండిగా ఉంటారు.. కాబట్టి ఆ స్టాండ్‌‌నే కొనసాగిస్తారన్నది తన అభిప్రాయమన్నారు. ఎవరేం చెప్పినా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది కాబట్టి.. ఆ నిర్ణయం తీసుకునే స్వాతంత్ర్యం జగన్‌కు ఉంటుందన్నారు.

Read Also:'డ్యాష్ బోర్డులో అన్నీ గమనించే బాబుకు.. కోడెల ఫర్నీచర్ నొక్కేయడం కనపడలేదా'

ఇటు కేసీఆర్‌తో జగన్ దోస్తీపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తో ఎవరు కలిసినా నాశనమే అంటూ ఘాటుగా స్పందించారు. ఆయనకు అధికారమే ముఖ్యమని.. కేసీఆర్‌ను నమ్మడం మంచిది కాదన్నారు. ముందు కాంగ్రెస్ తర్వాత చంద్రబాబు, తర్వాత బీజేపీ ఇప్పుడు జగన్.. ఇలా గత చరిత్రను మర్చిపోవద్దన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ఆస్తులపై క్లారిటీ తీసుకుంటే మంచిదని.. పెండింగ్ అంశాలు అలాగే ఉన్నాయి.. కొత్త బురదలో చిక్కకుంటే జగన్‌కు కష్టాలు తప్పవని హెచ్చరించారు. కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలని.. అక్కడ ఇబ్బంది పడేది జగన్ కాదు ఏపీ ప్రజలు అంటూ గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.