యాప్నగరం

జగన్‌కు స్వాగతం పలికిన బీజేపీ ఎంపీ.. శాలువాతో సన్మానం

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్. శాలువా కప్పి సన్మానించిన టీజీ. కర్నూలునున న్యాయ రాజధానిగా చేసినందుకు ధన్యావాదాలు తెలిపిన వెంకటేష్.

Samayam Telugu 27 Feb 2020, 3:59 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కలిశారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు టీజీ స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానం చేశారు.. బీజేపీ ఎంపీ అయినా సీఎం జగన్‌ను కలిసి సన్మానించడం ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu tg.


కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు జగన్‌ను టీజీ వెంకటేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సన్మానం తర్వాత ఇద్దరి మధ్య ఎయిర్‌పోర్టులో ఆసక్తికర సంభాషణ జరిగిందట. కర్నూలుకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని జగన్‌ను ఎంపీ టీజీ అడగ్గా.. కేంద్రం అనుమతి కోరామని.. నివేదిక కూడా పంపించామని సీఎం చెప్పారట.

రాయలసీమ డిక్లరేషన్‌లో, బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉందని.. కాబట్టి హైకోర్టుకు సంబంధించి కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావొచ్చని ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారట. ముఖ్యమంత్రి జగన్ పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పెళ్లి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓర్వకల్లు విమానశ్రయంలో జగన్‌కు ఎంపీ టీజీతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.