యాప్నగరం

జగన్‌ రెడ్డి గారు.. ప్రధాని హత్యకు కుట్ర చేసిన వ్యక్తిని విడుదల చేయాలని మీ ఎమ్మెల్యే లేఖ ఎలా రాశారు: సునీల్

భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా.. తక్షణమే MLA పై చర్యలు తీసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 29 Aug 2020, 1:02 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ సంచలన ట్వీట్ చేశారు. ప్రధానిని హతమార్చడానికి కుట్ర పన్నిన వ్యక్తిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే లేఖ రాయడంపై స్పందించారు. సునీల్ తన ట్వీట్‌లో ‘జగన్ రెడ్డి గారూ.. దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని కోరిన భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా.. తక్షణమే MLA పై చర్యలు తీసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు.
Samayam Telugu సీఎం జగన్


విరసం నేత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నార.. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ తేలింది.. తర్వాత కోలుకున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదని.. వెంటనే విడుదల చేయాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి పలువురు లేఖలు రాశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కూడా లేఖ రాశారు.. దీనిని ప్రస్తావిస్తూ సునీల్ ధియోధర్ జగన్‌‌ను టార్గెట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.