యాప్నగరం

Ysrcp Vs Bjp: ఎంపీ విజయసాయికి సునీల్ దేవధర్ కౌంటర్

పసుపు రంగునే కాదు.. అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండి అంటూ సునీల్ కౌంటర్.

Samayam Telugu 9 Jul 2020, 1:16 pm
ఏపీలో వైఎస్సార్‌సీపీ-బీజేపీ మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. పసుపు మిడతలు కమలం పువ్వుపై వాలుతున్నాయని.. బీజేపీ చీఫ్ కన్నాను కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌తో దుమారం రేగగా.. బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఎంపీ విజయసాయికి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ స్పందించారు. విజయసాయిరెడ్డి గారూ కేవలం పసుపు రంగునే కాదు.. అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది అన్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి

విజయసాయి తన ట్వీట్‌లలో ‘ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..?. బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న..ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది అంటూ టార్గెట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.