యాప్నగరం

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. తిరుపతిలో కలకలం

రైలు పట్టాలపై భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఓ డబ్బా పేలినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 8 Dec 2020, 5:57 pm
రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట వద్ద రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావ మైంది. ఒక డబ్బా పేలి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మహిళ చెబుతోంది. స్థానికులు వెంటనే ఆ మహిళను హాస్పిటల్ కి తరలించారు. హుటాహుటిన పేలుడు ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని కాసేపు నిలుపుదల చేశారు. నాటుబాంబు పేలినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బాలో ఉంచిన బాంబులు పేలాయా? లేక మరేదైనా కెమికల్ డబ్బా పేలుడు జరిగిందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tirupati


Also Read:
యువతి ఆత్మహత్య.. ఆమె ఫోన్‌లో షాకింగ్ వీడియో.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.