యాప్నగరం

‘టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీయేసయ్య.. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న జగన్’

తిరుమల ఏడు కొండలు కాదు.. రెండు కొండలేనని జీవో తెచ్చిన తండ్రి వైఎస్‌కి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌. ఆలయ పవిత్రతను మంటగలిపిన వారందరూ దేవుని శిక్షకు గురయ్యారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 1 Dec 2019, 4:24 pm
తిరుమల బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం వివాదం మరువకముందే మరో వివాదం రాజుకుంటోంది. టీటీడీ వెబ్‌సైట్‌లో క్రిస్టియానిటీకీ సంబంధించిన కంటెంట్ దర్శనమిచ్చిందంటూ విపక్షాలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్లాది హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను, ఆగమ శాస్త్ర విలువలను మంటగొలిపేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Samayam Telugu -Jagan


గతంలో తిరుమల ఏడు కొండలు కాదు.. రెండు కొండలేనని జీవో తెచ్చిన తండ్రి వైఎస్‌కి తగ్గ తనయుడని సీఎం జగన్‌ అనిపించుకుంటున్నారని విమర్శించారు. తిరుమల బస్‌ టిక్కెట్లపై అన్యమత ప్రచారం.. టీటీడీలో అన్యమతస్తులు విధులు నిర్వర్తించడాన్ని ఆనందసూర్య తప్పుబట్టారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్‌ చేయడం.. పవిత్ర తిరుమల దేవాలయంపై మంత్రుల ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: శంషాబాద్ మర్డర్ ఎఫెక్ట్.. ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం

తాజాగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోని పంచాంగ సమాచారంలో 'శ్రీ యేసయ్య' అనే అక్షరాలు వేంకటేశ్వరస్వామి భక్తులను తీవ్రంగా కలిచివేశాయని ఆనంద సూర్య ఆవేదన చెందారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతందని.. అన్యమత దైవాన్ని కానీ కలలో కూడా ఊహించలేదన్నారు. భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోందన్నారు ఆనందసూర్య.

తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు గుప్పించే దేవదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను మంటగలిపిన వారందరూ దేవుని శిక్షకు గురయ్యారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకుని తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని.. లేకుంటే హిందువులందరూ సంఘటితమై పోరాటానికి దిగితే జగన్ ప్రభుత్వం కనుమరుగవుతందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.

Read Also: సీఎం జగన్ చెప్పారు.. ఆ ఇళ్లు పూర్తిగా ఫ్రీ.. మంత్రి బొత్స

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.