యాప్నగరం

YSRCP ఎమ్మెల్యే బావకు కరోనా పాజిటివ్.. 500 మందికి విందు? గుంటూరులో రెడ్ అలర్ట్

Coronavirus Case in Guntur | గుంటూరులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో గుంటూరులోని పలు కాలనీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Samayam Telugu 27 Mar 2020, 4:00 pm
గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బావకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన మూడు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మార్చి 18న గుంటూరు తిరిగొచ్చారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో హాస్పిటల్‌కు తరలించగా... అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. గుంటూరు తిరిగొచ్చిన ఆయన మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహించిన రోజున గుంటూరులో సుమారు 500 మందికి విందు ఇచ్చారని సమాచారం.
Samayam Telugu corona india


దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించే పనిలో పోలీసులు, అధికారులు నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచి గుంటూరులో కఠినంగా కర్ఫ్యూ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. తన బావకు అనారోగ్యంగా ఉందని చెప్పగానే హాస్పిటల్‌కు తీసుకెళ్లమని ముందుగా తానే సూచించానని వైఎస్సార్సీపీ నేత తెలిపారు. ఆయన గుంటూరు వెళ్లి వచ్చిన సంగతి తనకు తెలియదన్నారు.

గుంటూరులో కరోనా కేసు నమోదవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మంగళ దాస్ నగర్, అరుంధతి నగర్, ఆర్టీసీ కాలని, అంబేద్కర్ నగర్, సీతా నగర్, నెహ్రూ నగర్, వాసవి నగర్ కాలనీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ కాలనీల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా చర్యలు తీసుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.