యాప్నగరం

తూ.గో: వేట కొడవళ్లతో వెంబడించి వ్యక్తిపై హత్యాయత్నం

మంగళవారం రాత్రి ఇజ్రాయిల్‌కు ఓ స్థానిక వ్యక్తి ఫోన్ చేసి ఓ చోటికి రమ్మన్నాడట.. అతడు వెళ్లగానే వేట కొడవళ్లతో దాడి చేశారు. ప్రాణ భయంతో పరుగులు తీసినా వదల్లేదని.. తనను నరికారని బాధితుడు చెబుతున్నాడు.

Samayam Telugu 29 Apr 2020, 1:05 pm
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో స్థానికుడిపై హత్యాయత్నం కలకలంరేపింది. కే గంగవరం మండలం మసకపల్లిలో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. వేటకొడవళ్లతో నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి.. అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇజ్రాయిల్‌పై హత్యాయత్నం స్థానికంగా కలకలంరేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu హత్యాయత్నం


మంగళవారం రాత్రి ఇజ్రాయిల్‌కు ఓ స్థానిక వ్యక్తి ఫోన్ చేసి ఓ చోటికి రమ్మన్నాడట.. అతడు వెళ్లగానే వేట కొడవళ్లతో దాడి చేశారు. ప్రాణ భయంతో పరుగులు తీసినా వదల్లేదని.. తనను నరికారని బాధితుడు చెబుతున్నాడు. భూషణం అనే వ్యక్తి తనపై హత్యాయత్నం చేయించాడని అతడు ఆరోపిస్తున్నాడు. అయితే భూషణం పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

బాధితుడు ఇజ్రాయిల్ గతంలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ద్రాక్షారామంలో ఈ ఘటన జరిగింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పక్కనే ఉండగానే ఘటన జరిగింది. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.