యాప్నగరం

Guntur: పెళ్లైన మహిళతో బీటెక్ స్టూడెంట్‌ ఎఫైర్.. చివరికి..

వివాహిత మహిళ బీటెక్ స్టూడెంట్‌తో శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ విషయం గ్రామంలో తెలిసిపోవడంతో గొడవలు జరిగాయి. చివరికి విషాదం చోటుచేసుకుంది.

Samayam Telugu 26 Nov 2020, 5:05 pm
పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం బీటెక్ స్టూడెంట్ ప్రాణాలు తీసింది. వివాహితతో రాసలీలల వ్యవహారం బయటికి పొక్కడంతో గ్రామంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. సత్తెనపల్లి మండలం అబ్బూరుకి చెందిన గద్దె వెంకట్రావు కుమారుడు శ్రీనివాసరావు(22) బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


ఆమెతో రాసలీలలు సాగిస్తున్న వ్యవహారం బయటికి తెలిసిపోవడంతో గ్రామంలో గొడవలు జరిగాయి. దీంతో కొద్దికాలం వేరే ప్రదేశానికి వెళ్లిపోయిన శ్రీనివాసరావు కొద్దిరోజుల కిందటే గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువకుడు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. అక్రమ సంబంధం వ్యవహారం అందరికీ తెలిసిపోవడం.. గ్రామంలో గొడవల కారణంతో తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: గుంటూరు బ్యాంకు దోపిడీ: ఒక్కసారిగా అంత డబ్బు చూసి.! షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.