యాప్నగరం

అనంతపురం: పబ్జీకి బానిసై పిచ్చోడయ్యాడు.. ప్రాణాలు తీసుకున్నాడు

కిరణ్ కుమార్ రెడ్డి చెన్నైలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. కాలేజీలో చదువుకునే సమయంలోనే పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు.. లాక్‌డౌన్ సమయంలో కూడా బాగా ఆడుతున్నాడు.

Samayam Telugu 12 Sep 2020, 9:09 am
అనంతపురంలో విషాద ఘటన జరిగింది. పబ్జీ గేమ్‌కు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో రెవెన్యూ కాలనీకి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చెన్నైలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. కాలేజీలో చదువుకునే సమయంలోనే పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు.. లాక్‌డౌన్ సమయంలో కూడా బాగా ఆడుతున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే బాగా బానిసగా మారాడు. పగలు, రాత్రి తేడా లేకుండా ఆ పిచ్చిలోనే ఉండిపోయాడు.
Samayam Telugu పబ్జీ పిచ్చిలో ఆత్మహత్య


ఇటీవల కేంద్రం పబ్జీ గేమ్ రద్దు చేయడంతో కిరణ్‌కుమార్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 7న తమ ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంటి పైన నిర్మాణంలో ఉన్న ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో కూలీలు తలుపులు పగలగొట్టి చూశారు. లోపల కిరణ్‌కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.