యాప్నగరం

నారా లోకేష్ పర్యటన నిర్వాహకులపై కేసు నమోదు

అనంతలో తాజాగా నారా లోకేష్ పర్యటించారు. దీంతో ఆయన పర్యటన నిమిత్తం పలువురు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదంటూ పలువురిపై ఎస్సై ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 18 Jun 2020, 9:25 am
అనంతపురంలో ఇటీవలే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పర్యటించారు. అనంతలో జేసీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ పవన్‌ను పరామర్శించడానికి లోకేశ్‌ సోమవారం తాడిపత్రి వచ్చారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానుల్లో చాలామంది మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని తాడిపత్రి టౌన్‌ ఎస్సై ఖాజా హుస్సేన్‌ ఫిర్యాదుచేశారు.
Samayam Telugu నారా లోకేష్


నారా లోకేశ్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసిన ఇద్దరిపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసు నమోదుచేశారు. కేసు అప్పుడే నమోదైనా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులైన రఘునాథ, సోమశేఖర్‌పై జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్‌ 51(బీ), ఐపీసీ సెక్షన్‌ 188 కింద సీఐ తేజోమూర్తి కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.