యాప్నగరం

ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక దాడులు

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, లంచగొండితనం భారీగా పెరిగిపోయిందని సాధారణ పౌరులు, చిరు వ్యాపారవేత్తలు భావిస్తున్న సమయంలో సీబీఐ ఆకస్మిక సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Samayam Telugu 31 Aug 2019, 8:47 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో శుక్రవారం సీబీఐ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ విభాగాలు, విజిలెన్స్‌ అధికారుల సాయంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు సీబీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, హన్మకొండ, కరీంనగర్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గువహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పుణే, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్‌పూర్, నాగ్‌పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్ నగరాల్లో సోదాలు నిర్వహించారు.
Samayam Telugu CBI-AFP


విద్యుత్తు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఈఎస్‌ఐసీ, రవాణా, సీపీడబ్ల్యూడీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌, ఫైర్‌ సేవలు, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లు, జీఎస్టీ విభాగం, పోర్టు ట్రస్టు, జాతీయ రహదారులు డీఏవీపీ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, డీజీఎఫ్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఏఎస్‌ఐ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఉక్కు సంస్థలు, గనులు, ఖనిజాలు, ఎన్‌సీటీ పరిశ్రమల విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని సాధారణ పౌరులు, చిరు వ్యాపారవేత్తలు భావిస్తున్న తరుణంలో ఈ ఆకస్మిక తనిఖీలు జరిపిపట్టు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సోదాల వల్ల అవినీతి, సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఉపశమనం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.