యాప్నగరం

సీఎం జగన్‌ పిటిషన్.. సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మిహనాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈసారైనా ఊరట దొరికేనా'

Samayam Telugu 20 Sep 2019, 4:50 pm
సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు హాజరుపై తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. కానీ కోర్టు కొట్టేసింది. దీంతో మళ్లీ అలాంటి పిటిషన్‌ను ఇప్పుడు ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. పరిస్థితులు మారాయని విచారణ చేపట్టొచ్చని జగన్‌ తరపు లాయర్ కోర్టుకు సూచించారు. జగన్ విజ్ఞ‌ప్తిని పరిశీలించిన కోర్టు.. పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.
Samayam Telugu jagan.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు. కోర్టులో తనకు బదులుగా తన లాయర్ హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సిన బాధ్యత తనపై ఉన్నందున.. తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదని.. హైదరాబాద్ రావడానికి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఓ విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారంగా మారిందని పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.