యాప్నగరం

సీఎం జగన్‌కు ఇదే చివరి అవకాశం.. సీబీఐ కోర్టు సంచలన ఆదేశాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల కేసులకు సంబంధించి సీబీఐ కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

Samayam Telugu 26 May 2021, 5:55 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌కు చివరి అవకాశం ఇచ్చింది. ఈ సాటి ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలుకు సీఎం జగన్‌, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. దీంతో కోర్టులో హాట్‌హాట్‌గా వాదోపవాదనలు జరిగాయి.
Samayam Telugu జగన్ సీబీఐ కేసులు


పోల్: సీఎం జగన్ రెండేళ్ల పాలన ఎలా ఉంది ? సమయం ఒపీనియల్ పోల్

లాక్‌డౌన్‌ కారణంగా కౌంటర్‌ దాఖలు చేయలేకపోతున్నామని సీఎం జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ సిద్ధంగా ఉంటే మెయిల్‌ ద్వారా సమర్పించవచ్చని.. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ ఎంపీ రఘురామను వేధిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్‌ అన్నారు. సీబీఐ ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. అయితే, సీబీఐ నుంచి ఇంకా సూచనలు రానందునే కౌంటర్ దాఖలు చేయలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. మరోసారి గడువు ఇవ్వొద్దని, ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. కౌంటర్ దాఖలు చేసేందుకు సీఎం జగన్‌‌కు, సీబీఐకి చివరి అవకాశం ఇచ్చింది. ఈసారి కౌంటర్‌ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌ 1వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.