యాప్నగరం

ఏపీకి కేంద్ర బృందం.. నాలుగు జిల్లాల్లో పర్యటన

ఒకట్రెండు రోజులలో నష్టంపై అధికారులు తుది అంచనాలను సమర్పించనున్నారు. వరదల వల్ల 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. సుమారు రూ.10వేల కోట్ల మేర పంట, ఆస్తి నష్టం జరిగింది అంటున్నారు.

Samayam Telugu 31 Oct 2020, 2:57 pm
ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. నవంబర్ 9, 10న వరద నష్టం అంచనాపై కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో బృందం పర్యటనకు రానుంది. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించనుంది. ప్రభుత్వం కూడా పంట, ఆస్తి నష్టం అంచనాలను సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజులలో నష్టంపై అధికారులు తుది అంచనాలను సమర్పించనున్నారు. వరదల వల్ల 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. సుమారు రూ.10వేల కోట్ల మేర పంట, ఆస్తి నష్టం జరిగింది అంటున్నారు.
Samayam Telugu File Photo


రోడ్లు, వ్యవసాయం, ఆక్వా, ఉద్యాన పంటలు, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు భారీగా నష్టం జరిగిందని చెబుతున్నారు అధికారులు. ఆర్ అండ్ బీకి సుమారు రూ.5వేల కోట్లు నష్టం జరిగినట్లు సమాచారం.. దాదాపు 2.40 లక్షల రైతులపై వరద ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వారంగం దారుణంగా దెబ్బతిందని చెబుతున్నారు.. ప్రభుత్వం రూపొందించిన వరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు అడగాలని అధికారులు భావిస్తున్నారు.. రోడ్ల మరమ్మతులు, రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ కోసం అత్యవసరంగా రూ.వెయ్యి కోట్లు అవసరమని అధికారుల అంచనా వేస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంది. దీంతో కేంద్రం నుంచి బృందం రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తోంది.. నష్టంపై ఓ అంచనాకు రానుంది. ఇటు తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన ఇప్పటికే పూర్తి అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.